న్యూఢిల్లీ: ఎయిర్బస్ కంపెనీకి చెందిన A350 విమానాలను(A350 Aircraft) డొమెస్టిక్ రూట్లలో నడిపేందుకు ఎయిర్ ఇండియా సంస్థ సిద్దమైంది. జనవరి 22వ తేదీ నుంచి A350 విమాన సర్వీసులు స్టార్ట్ కానున్నాయి. బెంగుళూరు నుంచి ముంబై రూట్లో తొలి A350 విమానాన్ని నడపనున్నారు. A350-900 విమానంలో త్రీ క్లాస్ క్యాబిన్లు ఉంటాయి. దీంట్లో 316 సీట్లు ఉంటాయి. ఇందులో 28 బిజినెస్ క్లాస్, 24 ప్రీమియం ఎకానమీ, 264 ఎకానమీ సీట్లు ఉంటాయి. ఎయిర్ బస్ A350 విమానం కమర్షియల్ సర్వీస్లోకి జనవరి 22వ తేదీ నుంచి ఎంటర్కానున్నట్లు ఇవాళ ఎయిర్ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Bookings open for our Airbus A350 operations in the domestic sector.
The brand-new aircraft, which is India’s first, will start commercial service from 22nd January 2024.
This is our way of celebrating the New Year with all of you, who just can’t wait to fly the new… pic.twitter.com/y0YebLee5v
— Air India (@airindia) January 1, 2024
తొలుత ఈ విమానాన్ని డొమెస్టిక్ రూట్లలో నడపనున్నారు. బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల మధ్య ఈ విమానాలు ఎగరనున్నాయి. ఆ తర్వాత A350 విమానాలను ఇతర దేశాలకు నడపనున్నారు. A350 కోసం ఎయిర్ ఇండియా బుకింగ్స్ స్టార్ట్ చేసింది. ఎయిర్ బస్ సంస్థ నుంచి సుమారు 20 A350 విమానాలను కొనుగోలు చేశారు. దాంట్లో తొలి విమానం డిసెంబర్ 23వ తేదీన ఢిల్లీకి చేరుకున్నది.