న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ సెగ వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నది. పలు అంతర్జాతీయ రూట్లలో తమ వైమానిక సర్వీసులను తగ్గించనున్నట్టు, అలాగే మరికొన్ని మార్గాల్లో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జెట్ ఫ్యూయల్ ధరలు పెరుగడం, వైమానిక మార్గంలో ఏర్పడిన అవరోధాలు, ఆంక్షలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ ఏడాది జూన్-ఆగస్టు మధ్య దీనికి సంబంధించి సర్దుబాట్లు చేయనున్నట్టు తెలిపింది.
ప్రతి నెలా 1200కుపైగా అంతర్జాతీయ విమానాలు యథావిధిగా నడుస్తాయని పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోవాలన్న ప్రధాని పిలుపుతో విదేశీ ఎంక్వైరీలు 15% పడిపోయాయి.