రన్వే పై ఉండగానే ఎయిరిండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737-800 విమానం నుంచి పొగలు రావటం కలకలం రేపింది. బుధవారం ఒమన్ రాజధాని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొచ్చికి బయలుదేరే కొద్దిసేపటి ముందు ఈ ఘటన చోటుచేసుకొన్నది.
అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను హుటాహుటిన కిందికి దించేయటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 14 మందికి గాయలయ్యాయి.