Somanath | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ నెల 23న విజయవంతంగా చంద్రయాన్-3 మిషన్లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. చారిత్రక విజయం సాధించిన భారతీయ అంతరిక్షన పరిశోధనా సంస్థతో పాటు శాస్త్రవేత్తలకు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తతున్నాయి. ఈ క్రమంలోనే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు ఇండిగో విమానంలో అనూహ్య స్వాగతం లభించింది. ఎయిర్ హోస్టెస్ పూజా షా షేర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటున్నది.
‘ఇస్రో చైర్మన్ సోమనాథ్కు ఇండిగో విమానంలో సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావించాను. మా విమానంలో నేషనల్ హీరోస్ ఉండడం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది’ అంటూ పోస్ట్ పెట్టింది. వీడియోలో ఎయిర్పోస్ట్ పూజా.. విమానంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ను ప్రయాణికులకు పరిచయం చేసింది. ఈ సందర్భంగా కాస్త భావోద్వేగానికి గురైంది. ‘విమానంలోకి వచ్చిన ఇస్రో చైర్మన్ సోమనాథ్కు సంతోషిస్తున్నాను. సోమనాథ్ బృందానికి అభినందనలు. మీరు ఇండిగో విమానంలో ఉన్నందుకు మేం గర్విస్తున్నాం సార్. భారతదేశం గర్వపడేలా చేసిందుకు ధన్యవాదాలు’ అనగా.. ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు.