న్యూఢిల్లీ: ఫాస్ట్ఫుడ్ తిన్నా కాలేయం దెబ్బతింటుందని ఎయిమ్స్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఫాస్ట్ఫుడ్ తింటూ.. అనారోగ్యకరమైన జీవనశైలిని అవలంబించే వారికి కూడా కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వెల్లడించింది.
భారత్లోని సుమారు 38 శాతం మంది ఫ్యాటీ లివర్ (కొవ్వు పట్టిన కాలేయం) లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి (ఎన్ఏఎఫ్ఎల్డీ)తో బాధ పడుతున్నట్టు ఎయిమ్స్ తెలిపింది. 35 శాతం మంది పిల్లలు కూడా ప్రభావితమవుతున్నట్టు పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పరిమెంట్ హెపటాలజీలో ప్రచురించారు.