న్యూఢిల్లీ : కొవిడ్-19 స్వల్ప లక్షణాలతో బాధపడేవారు సీటీ స్కాన్ సెంటర్ల వైపు పరుగులు పెడుతున్నారని వారికి ఈ పరీక్షలు అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు. ఒక సీటీ స్కాన్ మూడు, నాలుగు వందల ఛాతీ ఎక్స్ రేలతో సమానమని, ఇది అందరికీ అవసరం లేదని చెప్పారు.
యువతలో పలుమార్లు ఇలాంటి స్కాన్ లు క్యాన్సర్ ముప్పును పెంచుతాయని ఆయన హెచ్చరించారు. కరోనా బాధితుల్లో ఆక్సిజన్ 93 శాతం కంటే తక్కవకు పడిపోవడం, విపరీతమైన అలసట, నీరసం ఉంటేనే దవాఖానలో చేరాలని సూచించారు. కొవిడ్-19 పాజిటివ్ గా తేలితే హోం ఐసోలేషన్ లో ఉంటూ వైద్యులను సంప్రదించాలని వారి సూచనల మేరకే పరిస్థితిని బట్టి ఆస్పత్రుల్లో చేరాలని స్పష్టం చేశారు.