న్యూఢిల్లీ: సృజనాత్మకతకు హద్దు లేదు. ఇక కృత్తిమ మేధస్సుతో క్రియేటివిటీని ఆపడం ఎవరి తరమూ కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య బూమ్ నడుస్తోంది. రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే కార్యరంగంలోకి దిగి తమకు తోచిన రీతిలో సేవ చేస్తున్నారు. ఇక హాలీవుడ్ సూపర్ హీరోలు(Super Heroes) కూడా ఆ లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయం వద్ద మార్వెల్, డీసీ కామిక్స్ కు చెందిన సూపర్ హీరోలు సేవ చేస్తున్నట్లు ఏఐ ఫోటోలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. అయోధ్యావాసులతో ఆ హీరోలు అందరూ ముచ్చటిస్తున్నట్లు ఫోటోలు కూడా పంపారు.
ఐరన్ మ్యాన్, సూపర్మ్యాన్, బ్యాట్మ్యాన్, వండర్ వుమెన్, స్పైడర్ మ్యాన్, థోర్, హల్క్, డెడ్పూల్ లాంటి సూపర్ హీరో క్యారెక్లర్లు అయోధ్యలో సంచరిస్తున్నట్లు ఏఐ ద్వారా కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. ఫేమస్ క్యారెక్టర్లు థానోస్, ద జోకర్, లోకి లాంటి క్యారెక్టర్లు కూడా ప్రజలతో కలిసిపోయారు. సాహిద్ ఎస్కే అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలను పోస్టు చేశారు. స్టార్స్ వార్స్, కెప్టెన్ జాక్ స్పారో లుక్స్ కూడా ఆ ఏఐ ఫోటోల్లో కనిపించాయి. అయోధ్య థీమ్తో ఆన్లైన్లో దర్శనం ఇస్తున్న ఆ ఫోటోలు ఫుల్ హిట్ కొట్టేశాయి. ఏఐ క్రియేటివిటీని చూసి అందరూ స్టన్ అవుతున్నారు.
ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామాలయాన్ని ఓపెన్ చేయనున్నారు. రామ్ లల్లాకు ప్రాణప్రతిష్ట జరగనున్నది. ఆ ఈవెంట్కు సుమారు 8 వేల మంది అతిథులు రానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ఉద్యోగులకు హాఫ్ డే హాలీడే ప్రకటించింది. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర అన్ని ఏర్పాట్లు చేస్తోంది.