Gujarat Riots | న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ అహ్మదాబాద్లోని స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. నరోదాగామ్ వద్ద చోటుచేసుకున్న అల్లర్లలో 11 మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మాయా కోద్నానీ, భజ్రంగ్ దళ్కు చెందిన బాబూ భజరంగీలు సహా 67 మందిని స్పెషల్ కోర్టు నిర్దోషులుగా తేల్చింది.
ఈ కేసులో స్పెషల్ టీమ్ మొత్తం 85 మందిని నిందితులుగా పేర్కొనగా, ఇందులో 18 మంది నిందితులు చనిపోయారు. మాయా కోద్నానీ తరఫున డిఫెన్స్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2017లో కోర్టుకు హాజరయ్యారు. గోద్రా ఘటన అనంతరం 2002లో రాష్ట్ర సీఎంగా నరేంద్రమోదీ ఉన్న సమయంలో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి. నరోదా పాటియా హత్యాకాండలో 97 మంది పౌరులు చనిపోయారు.