బెంగళూరు: కర్ణాటకలోని మైసూరులో ప్రతి ఏటా దసరా వేడుకలను అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తారు. ఇందులో ఏనుగుల కవాతు అయిన గజపాయన ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో దసరా వేడుకల కోసం వీరనహోసహళ్లి గ్రామం నుంచి 8 ఏనుగులను మైసూరుకు తీసుకొచ్చారు. ఈ ఏనుగులకు జిల్లా కలెక్టర్ బగాడి గౌతమ్, మేయర్ సునంద పాలనేత్రతో పాటు అధికారులు సంప్రదాయబద్ధమైన ఆచారాలు, పూజలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.