లక్నో : కొవిడ్-19 కేసుల పెరుగుదలతో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైన నేపథ్యంలో యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తన తల్లి అడ్మిట్ అయిన దవాఖాన వద్ద పోలీసులను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన తల్లి చికిత్స పొందుతున్న ప్రైవేట్ దవాఖాన నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళ్లవద్దని సదర్ లోని ఆగ్రా ఆస్పత్రి వద్ద పోలీసుల కాళ్లపై పడి రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళితే తన తల్లి చనిపోతుందని, తాను తిరిగి ఆక్సిజన్ ను ఎక్కడి నుంచి తీసుకురాగలనని పోలీసులను వేడుకున్నాడు.
తన తల్లిని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి తీసుకువస్తానని కుటుంబ సభ్యులకు తాను మాటిచ్చానని దయచేసి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళ్లద్దని ఆ వ్యక్తి పోలీసులను బతిమాలాడు. పోలీసుల ముందు మోకరిల్లి ప్రాధేయపడుతుండగా పోలీసులు తమ పనిలో నిమగ్నమైనట్టు వీడియోలో కనిపించింది. తన తల్లికి అమర్చిన ఆక్సిజన్ సిలిండర్ ను తీయవద్దని ఓ వ్యక్తి పోలీసులను వేడుకోవడం కండ్లు చమర్చేలా ఉందని, యూపీ పోలీసుల తీరు అమానవీయమని ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ యూత్ కాంగ్రెస్ యోగి సర్కార్ ను దుయ్యబట్టింది.
This is a really heart breaking video.
— Youth Congress (@IYC) April 28, 2021
A man is begging in front of policeman not to take a Oxygen cylinder he has arranged for his mom in Agra, UP.
This is a total inhumane act by the police.
Is this how you should treat your fellow citizens Mr Yogi ? pic.twitter.com/Z4qTqsl5rY