ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తన భార్యను స్తంభానికి కట్టేసి కొట్టిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లోని అర్సేనా గ్రామానికి చెందిన కుసుమా దేవి, శ్యామ్ బీహారి భార్యా భర్తలు. ఇద్దరి మధ్య గతకొంతకాలంగా గొడవ జరుగుతున్నది. ఈ క్రమంలో అతడు కుసుమా దేవిని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. వివిషయం పోలీసులకు చెప్పొంద్దని భర్త, అత్త.. ఆమెను హెచ్చరించారు. అయితే విసిగి వేసారిన ఆమె విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే అది తెలుసుకున్న శ్యామ్ బీహారి.. ఈ నెల 14న ఆమెను రోడ్డుపై స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టాడు. దీన్నంతా పొరుగువారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతున్నది.
#WATCH उत्तर प्रदेश: आगरा में एक पति ने अपनी पत्नी को खंबे से बांधकर डंडे से पीटा। घटना का वीडियो वायरल हुआ। (20.07) pic.twitter.com/ND9CbIo9dP
— ANI_HindiNews (@AHindinews) July 20, 2022
కాగా, ఈ ఘటన గత గురువారం (14వ తేదీన) జరిగిందని సికింద్రా పోలీసులు తెలిపారు. కమలా దేవి ఫిర్యాదు మేరకు శ్యామ్ బీహారి, అతని తల్లి బర్ఫా దేవిపై కేసు నమోదుచేశామని చెప్పారు. అయితే ప్రస్తుతం వారిద్దరు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.