న్యూఢిల్లీ : అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో ప్రయోగం చేపట్టింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 ఐదువేల మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించనున్నది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పరీక్ష రాత్రి 7.30 గంటలకు అబ్దుల్ కలాం ద్వీపంలో జరిగింది. అగ్ని సిరీస్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అయితే, కొత్త అగ్ని క్షిపణి 5వేల నుంచి 8వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించనున్నట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి సంబంధిత వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అగ్ని-5 పరీక్ష 2020లోనే జరుగాల్సి ఉండగా.. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది. ఇంతకు ముందు డీఆర్డీఓ జూన్లో అగ్ని ప్రైమ్ క్షిపణిని పరీక్షించింది.