లక్నో: నలుగురు వ్యక్తులు కలిసి ఖరీదైన 500కుపైగా లగ్జరీ కార్లు చోరీ చేశారు. వారు చదువుకోలేనప్పటికీ యూట్యూబ్లో వీడియోలు చూసి కార్ల చోరీ గురించి తెలుసుకున్నారు. చోరీ కార్లు అమ్మగా వచ్చిన డబ్బుతో లైఫ్ను ఎంజాయ్ చేశారు. (Men Stole Over 500 Cars) చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. తాజ్ మహ్మద్, రౌనక్ అలీకి రింకూ, హకీమ్తో పరిచయం ఏర్పడింది. ఈ నలుగురు కలిసి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో కార్లు చోరీ చేశారు. చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారు.
కాగా, సహచరులు జైలులో ఉన్నప్పుడు గుడ్డు, కాషిఫ్, మతీన్లతో కలిసి ఒక గ్యాంగ్ను తాజ్ ప్రారంభించాడు. లగ్జరీ కార్లను చోరీ చేసేవారు. కారు డోర్స్ తెరిచేందుకు హైటెక్ సాఫ్ట్వేర్ ఉపయోగించారు. దొంగిలించిన సుమారు 200 కార్లను సంభాల్లోని అమీర్కు సరఫరా చేశారు. అలాగే గుజరాత్ వడోదరలోని ఒక వ్యక్తికి కూడా వందలాది చోరీ కార్లు సరఫరా చేశారు. కార్లు అమ్మిన డబ్బును పంచుకుని జల్సా చేశారు. వారు దుబాయ్కు కూడా వెళ్లారు.
మరోవైపు కార్ల చోరీపై దర్యాప్తు చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘజియాబాద్లోని ముస్సోరీలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పలు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కార్ల నంబర్ ప్లేటు మార్చి అమ్మే అమీర్ దుబాయ్ నుంచి పనిచేశాడని పోలీసులు తెలిపారు. లగ్జరీ కార్ల డూప్లికేట్ కీ, కిట్లు కూడా సరఫరా చేసినట్లు చెప్పారు. అలాగే తాజ్, అతడి భార్య, కాషిఫ్, గుడ్డు కలిసి ఢిల్లీ రోహిణీ ప్రాంతంలో ఏటీఎంను పగులగొట్టి రూ.19.9 లక్షలు చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.