Gujarat | అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ స్పా యజమాని మొహిసిన్ ఓ మహిళను నడిరోడ్డుపై దారుణంగా కొడుతూ, ఈడ్చుకుంటూ, బట్టలను లాగేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అవుతున్నది. బాధితురాలు రెండు రోజుల వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఓ సామాజిక కార్యకర్త చొరవతో పోలీసులు బాధిత మహిళను గుర్తించగలిగారు.
పోలీసులు, మీడియా బాధితురాలికి నచ్చజెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను, మొహిసిన్ కలిసి ఈ స్పాను ఏర్పాటు చేశామని, ఈ నెల 25న రూ.5,000 కనిపించకపోవడంతో ఓ యువతిని ప్రశ్నించానని చెప్పారు. ఆ యువతిని ప్రశ్నించినందుకు మొహిసిన్ తనను కొట్టాడని చెప్పారు.