న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు చెత్తమయంగా మారడంపై విమర్శలు వచ్చాయి. ప్రయాణికులు వినియోగించిన వాటర్ బాటిళ్లు, తినే వస్తువుల కవర్లు, ప్లాస్టిక్ రేపర్లు చెల్లాచెదురుగా రైలు కోచుల్లో పడి ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేశారు. ఈ ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రికి ట్యాగ్ చేశారు.
ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు. వందే భారత్ రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విమానాల్లో అనుసరించే క్లీనింగ్ విధానాన్ని ఈ రైళ్లలో కూడా పాటించాలని పేర్కొన్నారు. దీంతో వందే భారత్ రైళ్లలో కూడా కొత్త క్లీనింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. సిబ్బంది ఒక కవర్ను పట్టుకుని కోచ్లో వెళ్తూ చెత్తను అందులో వేయమని ప్రయాణికులను కోరుతాడు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ వ్యవస్థను మార్చినట్లు తెలిపారు. అలాగే ఈ రైళ్లలో శుభ్రత కోసం ప్రయాణికుల సహకారం ఆశిస్తున్నట్లు ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
Cleaning system changed for #VandeBharat trains.
आपका सहयोग अपेक्षित है। https://t.co/oaLVzIbZCS pic.twitter.com/mRz5s9sslU— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 28, 2023