చండీఘడ్: పంజాబ్లో మంగళవారం రాత్రి రెండు పేలుళ్ల(Punjab Blasts) ఘటనలు జరిగాయి. జలంధర్లో తొలుత బీఎస్ఎఫ్ ప్రధానకార్యాలయం వద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ తర్వాత అర్థరాత్రి అమృత్సర్లో మరో పేలుడు ఘటన నమోదు అయ్యింది. ఖాసా రోడ్డులో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా సరిహద్దు గోడ వద్ద పేలుడు జరిగింది. గోడపై పెట్టిన ఓ షీట్ కిందపడిపోయింది.దేని వల్ల ఆ బ్లాస్ట్ జరిగిందో ఇంకా తెలియరాలేదు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్వల్ప స్థాయి తీవ్రతతో పేలుడు జరిగిందని అమృత్సర్ రూరల్ ఎస్పీ సోహెల్ ఖాసిమ్ మీర్ తెలిపారు.
రాత్రి 11.15 నిమిషాల సమయంలో భారీ శబ్ధం వచ్చినట్లు తమకు సమాచారం వచ్చిందని, దీంతో హుటాహుటిన ఆ ప్రదేశానికి పోలీసు బృందాలు వెళ్లినట్లు ఆయన తెలిపారు. బౌండరీ వాల్ మీద ఉన్న ఓ షీట్ కిందపడిపోయినట్లు గుర్తించామన్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబు నిర్వీర్య దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆర్మీ, బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి.
CCTV footage of the Jalandhar scooty blast outside BSF HQ. https://t.co/qBSvKJL2RO pic.twitter.com/cwCTkgq79V
— Elite Predators (@elitepredatorss) May 5, 2026
జలంధర్లోని బీఎస్ఎఫ్ హెడ్క్వార్టర్స్ దగ్గర తొలి పేలుడు ఘటన జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బీఎస్ఎఫ్ కార్యాలయం సమీపంలో పార్క్ చేసిన స్కూటర్ పేలింది. తొలుత ఆ స్కూటర్కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత అది పేలింది. సుమారు 300 మీటర్ల దూరం వరకు దాని ప్రభావం కనిపించింది. యాక్టివా స్కూటర్ పేలుడుకు చెందిన ఘటన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి.