శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని లాల్చౌక్ క్లాక్ టవర్ పైకప్పు పునరుద్ధరణ తర్వాత, శాశ్వతంగా జాతీయ జెండాను ఏర్పాటు చేస్తామని స్థానికుడు సాజిద్ యూసుఫ్ షా తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన మరో వ్యక్తితో కలిసి క్రేన్ సహాయంతో క్లాక్ టవర్పైకి చేరుకున్నారు. సుమారు 30 ఏండ్ల తర్వాత అక్కడ జెండా ఎగురవేసి చారిత్రక ఘట్టానికి తెర తీశారు.
కాగా, లాల్చౌక్లోని క్లాక్ టవర్పై ఆవిష్కరించిన జాతీయ జెండాను గంట తర్వాత తీసేసినట్లు
సాజిద్ యూసుఫ్ షా తెలిపారు. క్లాక్టవర్ పైభాగం శిథిలమైందని, జెండాను ఎక్కువ సేపు ఉంచేంత బలంగా కూడా అది లేదన్నారు. ఈ నేపథ్యంలో శాశ్వతంగా త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా క్లాక్ టవర్ పైభాగాన్ని పునరిద్ధరించమని శ్రీనగర్ మేయర్ను కోరినట్లు ఆయన చెప్పారు.
స్మారక స్థూపం పైకప్పు పునరుద్ధరణకు 3 నెలల కిందట నిధులు సేకరించామని, పనులను త్వరలో పూర్తి చేస్తామని మేయర్ తెలిపారని సాజిద్ అన్నారు. దీంతో పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత శ్రీనగర్లోని ప్రసిద్ధ లాల్చౌక్లోని క్లాక్ టవర్పై శాశ్వతంగా జాతీయ జెండాను అమర్చుతామని ఆయన వెల్లడించారు.