Betting App | న్యూఢిల్లీ, అక్టోబర్ 5: బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరికొంత మంది బాలీవుడ్ నటులకు నోటీసులు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ, నటులు హుమా ఖురేషి, హీనా ఖాన్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
రాయ్పూర్లోని తమ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, ఇదే కేసులో ఇప్పటికే రణబీర్ కపూర్కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.