మూడు రోజుల్లో 72 మంది మృతి
Maharashtra Hospitals | మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Maharashtra Hospitals) మరణ మృదంగం కొనసాగుతోంది. వివిధ కారణాలతో రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న నాందేడ్ ఆసుపత్రిలో 31 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శంభాజీనగర్లోని జీఎంసీహెచ్లోనూ పలువురు రోగులు మృత్యువాతపడ్డారు. తాజాగా రాష్ట్రంలోని మరో రెండు ఆసుపత్రుల్లోనూ (2 Maharashtra Hospitals) అదే పరిస్థితి నెలకొంది.
నాగ్పూర్ (Nagpur) ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (GMCH)లో 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించినట్లు ఆసుపత్రి అధికారులు బుధవారం వెల్లడించారు. ఆసుపత్రిలో 1900 పడకల సామర్థ్యం ఉందని, రోజూ సగటున 10 నుంచి 20 మంది రోగులు మరణిస్తున్నారని జీఎమ్సీహెచ్ డీన్ డాక్టర్ రాజ్ గజ్భియే తెలిపారు. అదేవిధంగా, నగరంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (Indira Gandhi Government Medical College and Hospita)లో 24 గంటల్లో తొమ్మిది మరణాలు సంభవించినట్లు ఆసుపత్రి సీనియర్ వైద్యులు తెలిపారు. ఈ ఆసుపత్రిలో 800 పడకల సామర్థ్యం కలిగి ఉందని, ప్రతిరోజూ సగటున ఆరుగురు రోగుల మరణిస్తున్నట్లు వివరించారు. కాగా, ఆ రెండు ఆసుపత్రుల్లో కలిసి 24 గంటల వ్యవధిలో మొత్తం 23 మరణాలు నమోదయ్యాయి.
కొద్దిరోజుల క్రితం థాణే ఆసుపత్రిలో 36 గంటల్లో 22 మంది రోగులు మరణించిన ఘటన మరవకముందే.. మొన్న నాందేడ్ ( Nanded)లో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల వ్యవధిలో ఏకంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం అందర్నీ కలిచివేసింది. ఆ తర్వాత ఛత్రపతి శంభాజీనగర్లోని జీఎంసీహెచ్లో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయని ఓ అధికారి తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు రోజుల వ్యవధిలోనే వివిధ కారణాలతో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ఆసుపత్రుల్లో రోగుల వరుస మరణాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని బాధిత కుటుంబాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ విమర్శిస్తున్నారు.
Also Read..
Chinese sailors | ఎల్లో సముద్రంలో చిక్కుకుపోయిన చైనా సబ్మెరైన్.. 55 మంది నావికులు మృతి
Rahul Gandhi | సోనియా గాంధీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్.. వీడియో వైరల్
Lalu Yadav | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు