న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : వరుస విమాన దుర్ఘటనల నేపథ్యంలో ‘నాన్ షెడ్యూల్డ్’ విమాన ఆపరేటర్లకు నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో భద్రతాపరమైన లోపాలకు పైలట్లపై నిందమోపితే కుదరదని, నిబంధనలు పాటించని నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు, వాటి మేనేజర్లపై వ్యక్తిగత చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ రంగంలోని ఆపరేటర్లతో డీజీసీఏ మంగళవారం సమావేశం నిర్వహించింది. జనవరి 28న బారామతిలో, సోమవారం జార్ఖండ్లో విమాన దుర్ఘటనలు.. రెండూ ‘నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్’ విమానాలే కావటంపై డీజీసీఏ చర్యలకు దిగింది. ఇతర ప్రమాణాలన్నింటి కంటే భద్రతే అత్యంత ముఖ్యమైందని ఆపరేటర్లకు తెలియజేసింది.