బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ తర్వాత మరో కొత్త వివాదం మొదలైంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ వార్డులలో పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని తల్లిదండ్రుల నుంచి హామీ తీసుకుంది. దీనిపై రైట్ వింగ్ హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ జన జాగరణ్ సమితి పాఠశాల చర్యను వ్యతిరేకించింది. పాఠశాల హిందూయేతర విద్యార్థులను బైబిల్ను చదవాలని బలవంతం చేస్తుందని సంస్థ ప్రతినిధి మోహన్ గౌడ ఆరోపించారు. మరో వైపు పాఠశాల యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది.
పాఠశాల బైబిల్ విద్యను అందజేస్తుందని ఆయన చెప్పారు. పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులు కూడా ఉన్నారని, వారిపై బైబిల్లోని బోధనలను బలవంతంగా నేర్చుకునేలా ఒత్తిడి చేస్తున్నారని హిందూ జన జాగృతి పేర్కొంది. అయితే, పాఠశాల తన వైఖరిని సమర్థించుకుంది. తాము బైబిల్ ఆధారిత విద్యను అందజేస్తామని పాఠశాల పేర్కొంది. ఇదిలా ఉండగా.. కర్నాటక ప్రభుత్వం పాఠశాలల్లో భగవద్గీతను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను ప్రకటించిన విషయం తెలిసిందే. పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని సైతం ఆలోచిస్తున్నది. ఇప్పటికే కర్నాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతున్నది. ఈ వ్యవహారంపై విచారణ సుప్రీం కోర్టులో ఉన్నది.