ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో ముంబైలోని సిటీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు. (Nawab Malik Hospitalised) నవాబ్ మాలిక్ కుమార్తెతోపాటు ఎన్సీపీ ప్రతినిధి ఈ విషయాన్ని ధృవీకరించారు. నవాబ్ మాలిక్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు.
కాగా, 2022 ఫిబ్రవరిలో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో మంజూరు చేసిన ఈ బెయిల్ను ఈ ఏడాది జనవరి 11న మరో ఆరు నెలలకు పొడిగించింది. మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో నవాబ్ మాలిక్ బాధపడుతున్నట్లు సమాచారం.