తిరువనంతపురం : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున కేంద్ర మాజీ మంత్రి కేవీ థామస్ను కాంగ్రెస్ పార్టీ గురువారం బహిష్కరించగా పార్టీ నిర్ణయంపై తనకు సమాచారం లేదని బహిష్కృత నేత పేర్కొన్నారు.
తాను ఇంకా ఏఐసీసీ, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సభ్యుడినేని, తన బహిష్కరణపై ఎలాంటి అధికారిక సమాచారం తనకు అందలేదని థామస్ అన్నారు. తనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు కేపీసీసీ చీఫ్ కే సుధాకరన్ అర్ధరాత్రి ప్రకటనపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కేవీ థామస్ పేరుతో చాలా మంది ఉన్నారని, కేపీసీసీ చీఫ్ పొరపాటున తన పేరును ప్రస్తావించారని వ్యాఖ్యానించారు. పార్టీ నేతను బహిష్కరించేందుకు ఓ వ్యవస్ధ ఉంటుందని చెప్పుకొచ్చారు. సీనియర్ నేతపై వేటు వేయడం అంటే ఏఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడం ఓ జోక్గా ఆయన అభివర్ణించారు.