లక్నో: అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి అనర్హుడు కానున్నారు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ (UP BJP MLA Ramdular Gond) ఏడాదిగా తనపై లైంగిక దాడులకు పాల్పడినట్లు 15 ఏళ్ల బాలిక 9 ఏళ్ల కిందట ఆరోపించింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో 2014 నవంబర్ 4న రాందులర్ గోండ్పై ఐపీసీతోపాటు పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, కేసు నమోదైనప్పుడు రాందులర్ గోండ్ ఎమ్మెల్యే పదవిలో లేరు. అయితే ఆయన భార్య సూర్తన్ దేవి గ్రామ సర్పంచ్గా ఉన్నది. 2018లో రాందులర్ బీజేపీలో చేరారు. 2022లో దుద్ది అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయనపై నమోదైన అత్యాచారం కేసు ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎహసాన్ ఉల్లా ఖాన్, బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ను దోషిగా ఈ నెల 12న నిర్ధారించారు. శుక్రవారం శిక్షలు ఖరారు చేస్తూ 25 ఏళ్లు జైలు శిక్ష విధించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దోషిగా తేలి శిక్ష పడిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ అసెంబ్లీ సీటును కోల్పోనున్నారు.
यूपी सोनभद्र में नाबालिक लड़की से रेप में विधायक रामदुलार गोंड दोषी करार
पीड़िता गर्भवती हो गई,पॉक्सो से बचने के लिए सर्टिफिकेट बदलवाए,ससुराल जाकर दी धमकी
मुस्कुराइए आपके वोट से बलात्कारी विधायक बन गया,बेटियो की सुरक्षा ऐसे बलात्कारियो के हाथ मे है.
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) December 13, 2023