సిటీబ్యూరో, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ): 59 ఏండ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం కనిపించింది. సౌర వ్యవస్థలోనే అతిపెద్దదైన గురుగ్రహంభూమికి అత్యంత సమీపంగా వచ్చింది. గురుగ్రహం పెద్దగా, అత్యంత ప్రకాశంగా కనిపించింది.
శని, బృహస్పతి, భూమి మూడు ఒకే సరళరేఖలో తారసపడ్డాయి. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏండ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరగా 1963లో ఈ దృశ్యం కనిపించింది. మళ్లీ ఈ అరుదైన పరిణామం 107 ఏండ్ల తర్వాత చోటుచేసుకుంటుంది. ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే భాగ్యం ఉండకపోవచ్చు.