కేరళలో 300 పందులను చంపేందుకు అధికారుల ఆదేశాలు
తిరువనంతపురం, జూలై 22: దేశంలో తొలిసారిగా కేరళలో ఆఫ్రికన్ స్వైన్ కేసులు వెలుగుచూశాయి. వయనాడ్ జిల్లా మనంతవాడిలోని పందుల్లో ఈ కేసులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
ఓ పందుల పెంపక కేంద్రంలో పెద్ద సంఖ్యలో పందులు మృతిచెందాయని, కారణాల కోసం వాటి శాంపిల్స్ను ల్యాబ్కు పంపినట్టు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా ఆ కేంద్రంలోని 300 పందులను చంపేయాలని ఆదేశాలిచ్చినట్టు వివరించారు.