Delhi High Court | న్యూఢిల్లీ: యవ్వనంలో ఉన్నవారిలో చిగురించే నిజమైన ప్రేమను చట్టాల కాఠిన్యంతో కానీ, పోలీసు చర్యలతో కానీ నియంత్రించలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యువతీ యువకులు ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని, ప్రశాంతంగా, చట్టబద్ధంగా జీవిస్తున్నపుడు, వారు పెళ్లి చేసుకునే సమయానికి వారిలో ఒకరు లేదా ఇద్దరూ మైనర్లు అయినా, మేజర్ అయ్యే వయసుకు సమీపంలో ఉన్నా, వారిపై రాజ్యం లేదా పోలీసు చర్యలను సమర్థించే ప్రయత్నం చేయడం ఎలా? అనే సందిగ్ధత అనేకసార్లు కోర్టులకు ఏర్పడుతుందని తెలిపింది.
యువకుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్లు 2015లో నమోదైన కేసును కొట్టివేసింది. వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ముస్లిం పద్ధతిలో పెళ్లి చేసుకుని, ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చి, ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపింది.