న్యూఢిల్లీ : నేవీ చీఫ్గా అడ్మిరల్ ఆర్ హరికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. ఆ తర్వాత తన తల్లి పాదాలను మొక్కి ఆశీర్వాదం తీసుకొని.. ఆప్యాయంగా కౌగిలించుకోగా.. ఆయన తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకు ముందు నేవీ చీఫ్గా పని చేసిన కేబీ సింగ్ పని చేశారు. 30 నెలల పాటు పదవిలో కొనసాగిన ఆయన.. మంగళవారం పదవీ విరమణ చేశారు.
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్లో భాగంగా థియేటర్ కమాండ్ స్ట్రక్చర్ ప్రాథమిక స్థాపనలో అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడం పట్ల తనకు గర్వకారణంగా ఉందన్నారు. భారత దేశ సముద్ర సరిహద్దు భద్రత కోసం పని చేస్తానన్నారు. దాదాపు 39 సంవత్సరాల కెరీర్లో అడ్మిరల్ హరికుమార్ నేవీలోని వివిధ కమాండ్లలో పని చేశారు.
అంతే కాకుండా స్టాఫ్ అండ్ డైరెక్టోరియల్ అపాయింట్స్మెంట్లోనూ సేవలందించారు. ఐఎన్ఎస్ నిశాంక్, క్షిపణి కొర్వెట్, ఐఎన్ఎస్ కోరా, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణవీర్ పని చేశారు. అలాగే ఐఎన్ఎస్ విరాట్ నౌకకు సైతం నాయకత్వం వహించిన ఆయన.. వెస్ట్రన్ ఫ్లీట్ ఆపరేషన్ ఆఫీసర్గాను సేవలందించారు. హరికుమార్ అమెరికాలోని నావల్ వార్ కాలేజీ, మోవ్లోని ఆర్మీ వార్ కాలేజీతో పాటు యూకేలోని రాయల్ కాలేజీ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో చదివారు.