శ్రీహరికోట: శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్1 స్పేస్క్రాఫ్ట్తో రాకెట్ నింగిలోకి వెళ్లింది. లిఫ్ట్ ఆఫ్ నార్మల్గా సాగింది. సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్1 (Aditya L1)మిషన్ను ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. లాంచ్ వెహికిల్ ప్రజ్వలనం అన్ని దశల్లోనూ నిర్దేశితంగా జరిగింది. ఏడు పేలోడ్స్తో ఆదిత్య .. భాస్కరుడి దిశగా వెళ్తున్న విషయం తెలిసిందే. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ వద్దకు ఆదిత్య వెళ్తోంది. అక్కడ నుంచి సూర్యుడిని ఆ స్పేస్క్రాఫ్ట్ స్టడీ చేయనున్నది.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches India's first solar mission, #AdityaL1 from Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh.
Aditya L1 is carrying seven different payloads to have a detailed study of the Sun. pic.twitter.com/Eo5bzQi5SO
— ANI (@ANI) September 2, 2023
లాంగరేంజ్ పాయింట్. ఇది ఇటలీ శాస్త్రవేత్త లాంరేంజ్ పేరు ఆధారంగా ఆ పాయింట్కు నామకరణం చేశారు. జేమ్స్ 2 టెలిస్కోప్ను లాంగరేంజ్2 పాయింట్ వద్ద ఫిక్స్ చేశారు. అయితే ఎల్1 పాయింట్ వద్ద ఆదిత్యను ఫిక్స్ చేయనున్నారు. దీన్నే వాంటేజ్ పాయింట్ అంటారు. భానుడి భగభగలను ఇక్కడ నుంచి అధ్యయనం చేయడం సులవుతుంది.
త్రిడైమెన్షనల్ పాయింట్గా కూడా భావిస్తారు. సౌర అన్వేషణ చేసేవాళ్లకు ఇది గొప్ప పాయింట్గా భావిస్తారు. ఈసానాసా అబ్జర్వేటరీకి చెందిన స్పేస్క్రాఫ్ట్ కూడా పాయింట్ వన్ వద్దే ఉంది. లాంగరేంజ్ పాయింట్ వద్ద గురుత్వాకర్షణ సమంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష అధ్యయనం కోసం ఈ పాయింట్ కీలకంగా ఉంటుంది. 125 రోజుల్లో ఈ పాయింట్కు ఆదిత్య చేరుకుంటుంది.
ఎటువంటి అడ్డు లేకుండా ఈ పాయింట్ నుంచి సూర్యుడిని చూడవచ్చు. రాకెట్ భూ వాతావరణం దాటగానే పేలోడ్స్ ఉన్న ఆదిత్య ఎల్1 స్పేస్క్రాఫ్ట్ దాని నుంచి వేరైంది. మూడవ దశలో ఈ ఘట్టం చోటుచేసుకున్నది.
సూర్యుడు మన నక్షత్రం. దీన్ని స్టడీ చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. ఏడు పేలోడ్స్ ఇచ్చే డేటా.. చాలా ప్రత్యేకమైంది కానున్నది. ఇప్పటి వరకు ఎటువంటి మిషన్ ఇవ్వని సమాచారాన్ని ఆ పేలోడ్స్ ఇవ్వనున్నాయి. సౌర తుఫాన్ల వల్ల కలిగే హై రేడియేషన్ గురించి ఈ మిషన్ కీలకమైన సమాచారాన్ని చేరవేయనున్నట్లు నిపుణుల ద్వారా తెలుస్తోంది.
సౌర తుఫాన్లు భూమి చేరేందుకు 8 నిమిషాలు పడుతుంది. భానుడు భగభగలాడినప్పుడు కలిగే ప్రవర్తనలను స్టడీ చేయడమే ఆ ప్రాజెక్టులో కీలకం. కరోనాను అతి దగ్గర నుంచి పేలోడ్ అధ్యయనం చేయనున్నది. కరోనా డైనమిక్స్, వెలాసిటీ, అక్కడ మ్యాటర్ ఎలా కదులుతోందన్న అంశాన్ని తేల్చనున్నారు. సూర్యుడిలో జరిగే పేలుళ్ల వల్ల కలిగే రేడియేషన్ను, ప్లాస్మాను స్టడీ చేయనున్నారు.
ఇండియాలో సూర్యుడి స్టడీ కోసం గ్రౌండ్ అబ్జర్వేటరీలు ఉన్నాయి. కొడైకెనాల్, ఉదయ్పూర్, నైనితాల్ నుంచి సూర్యుడిని మన అబ్జర్వేటరీలు వీక్షిస్తున్నాయి. కానీ కేవలం సూర్యుడి బాహ్య ఉపరితలాన్ని మాత్రమే ఆ అబ్జర్వేటరీల ద్వారా స్టడీ చేస్తున్నారు.
ఎల్1 పాయింట్ వద్ద స్పేస్క్రాఫ్ట్ను నిలపనున్న మూడవ దేశంగా ఇండియా నిలుస్తుంది. ఇప్పటికే ఆ పాయింట్ వద్ద రెండు అబ్జర్వేటరీలు ఉన్నాయి. ఆదిత్య ఎల్1 మిషన్ కోసం భారత్ సుమారు 300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.