న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ(Adhir Ranjan Chowdhury) మాట్లాడుతూ.. కేంద్ర సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఓ అంధ రాజులాగా మారిపోయినట్లు ఆరోపించారు. మణిపూర్ మండుతుంటే.. మోదీ మౌనంగా ఉన్నట్లు అధిర్ విమర్శించారు. మహాభారత ఘటనను ఆయన గుర్తుచేస్తూ.. దృతరాష్ట్ర మహారాజు అంధుడని, ఆయన పాలనలోనే ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని, ఇప్పుడు కూడా రాజు అంధుడిలా కూర్చున్నారని, మణిపూర్ అయినా..హస్తీనాపురమైనా తేడా ఏమీ లేదని అధిర్ రంజన్ ఆరోపించారు. అధిర్ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అడ్డుకున్నారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
బ్యాంకులకు వేల కోట్లు లూటీ చేసి పారిపోయిన నీరవ్ మోదీ గురించి కూడా అధిర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. వ్యాపారవేత్త నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోలేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో మౌనంగా ఉన్నట్లు అధిర్ ఆరోపించారు. ప్రధానిని పార్లమెంట్కు రప్పించేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందని అధిర్ అన్నారు. క్విట్ ఇండియా కావాలని, దేశం నుంచి మతతత్వం పోవాలన్నారు.దేశం నుంచి కాషాయీకరణ క్విట్ కావాలన్నారు.
#WATCH | Congress MP Adhir Ranjan Chowdhury says "Jab Dhritrashtra andhe the, tab Droupadi ka vastra haran hua tha, aaj bhi raja andhe baithe hai… Manipur aur Hastinapur mein koi farq nahi hai" pic.twitter.com/OXPAZqP26j
— ANI (@ANI) August 10, 2023