ముంబై: మద్యం మత్తులో బోసి మొలతో దవాఖాన అంతా తిరిగాడో డాక్టర్ (Doctor). మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన హాస్పిటల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఔరంగాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిద్కిన్ ప్రభుత్వ దవాఖానలో డాక్టర్.. పూటుగా తాగి బట్టలన్నీ తీసేసి నగ్నంగా హాస్పిటల్ ఆవరణలో తిరిగాడు. హాస్పిటల్లోని టాయ్లెట్ నుంచి బయటకు వస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉన్నది. ఆ సమయంలో తన ఒంటిపై ఉన్న దుస్తులను ఇప్పి పక్కకు పడేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
ఆ డాక్టర్ పేరు తెలియనప్పటికీ.. అతడు మత్తు పదార్థాలకు బానిసగా మారాడని తెలుస్తున్నది. కాగా, ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ దయానంద్ (Dr Dayanand) స్పందిస్తూ.. హాస్పిటల్ సూపరింటెండెంట్ నుంచి వివరణ కోరామని చెప్పారు. విచారణ అనంతరం డాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.