(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హిండెన్బర్గ్ నివేదిక అనంతరం ఆదానీ-మోదీ సంబంధాల పట్ల దేశ రాజకీయాలు అట్టుడికిన నేపథ్యంలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్తో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భేటీ కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలకు వీరిద్దరి భేటీ షాక్ ఇచ్చినైట్టెంది. ఇదిలా ఉంటే 3, 4 రోజలుగా మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు శరద్ పవార్ పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఏక్నాథ్ షిండేను గద్దె దించి ఎన్సీపీ నేత అజిత్ పవార్ను ఆ సీట్లో కూర్చొబెట్టేందుకు కుట్ర జరుగుతున్నట్టు ప్రచారం గుప్పుమంది. ఈ పరిణామాలన్నీ శరద్ పవార్ కనుసన్నలలోనే జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి.