కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి
న్యూఢిల్లీ, మే 30: కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతున్నది. పార్టీ కోసం పనిచేసి, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిసారీ పాతవారికే అవకాశమివ్వడమేంటని నిలదీస్తున్నారు.
నటి నగ్మా స్పందిస్తూ ‘నా 18 ఏండ్ల నిరీక్షణ ఇమ్రాన్ భాయ్ ముందు ఓడిపోయింది’ అని ట్వీట్ చేశారు. ఇమ్రాన్ను కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర నుంచి బరిలోకి దింపింది. నగ్మాతోపాటు చాలా మంది నేతలు తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.