న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దాదాపు రూ.200 కోట్లను అక్రమంగా దారి మళ్లించిన కేసులో ప్రముఖ నటి నోరా ఫతేహీని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఢిల్లీలోని పోలీసుల కార్యాలయంలో 9 గంటలపాటు ఆమెను విచారించారు. ముఖ్యంగా ఈ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్తో నోరాకు ఉన్న సంబంధాలు, అతడి నుంచి స్వీకరించిన ఖరీదైన బహుమతులు తదితరాలపై పోలీసులు ప్రశ్నించారు. 50కిపైగా ప్రశ్నలను అడిగారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి జాక్వెలిన్ ను గతంలో ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.