ఊళ్లో జరుగుతున్న పండగ చూడ్డానికి తాతయ్యతో కలిసి వెళ్లిందా పాప. తిరిగి వచ్చే సమయంలో బెలూన్ కావాలంది. అలా అడగటమే ఆ పాప ప్రాణాలు తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్కు 150 కిలోమీట్ల దూరంలో ఉండే షిండీ గ్రామంలో వెలుగు చూసింది. స్థానికంగా జరుగుతున్న తన్హా పోలా ఉత్సవాలకు తాతయ్యతో కలిసి ఒక రెండేళ్ల పాపా కూడా వెళ్లింది.
తిరిగి వచ్చేటప్పుడు బెలూన్ కావాలనడంతో అది కొనేందుకు వెళ్లారు. బెలూన్ కొంటుండగా.. దానికి గాలి పట్టే గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాపను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ పాప కన్నుమూసిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.