న్యూఢిల్లీ, మార్చి 1: జ్ఞానవాపీ మసీదు ఉన్న చోట ఆలయాన్ని పునరుద్ధరించాలన్న వ్యాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జ్ఞానవాపీ మసీదు మేనేజ్మెంట్ కమిటీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను విచారణకు తీసుకుంటున్నట్టు కోర్టు శుక్రవారం తెలిపింది.
మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ 1991లో దావాను కొనసాగించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 19న కొట్టివేసింది. వివాదాస్పద స్థలం మతపరమైన స్వభావాన్ని కోర్టు మాత్రమే నిర్ణయిస్తుందని హైకోర్టు పేర్కొంది.