Power Consumption | న్యూఢిల్లీ, అక్టోబర్ 24: భారత్లో విద్యుత్తు వినియోగం నానాటికీ అధికమవుతున్నదని, దీంతో కేవలం ఇండ్లలో ఎయిర్ కండిషనర్ (ఏసీ)లకు ఉపయోగించే విద్యుత్తే 2050 నాటికి ఏకంగా 9 రెట్లు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) వెల్లడించింది. ఇది ఆఫ్రికా ఖండంలోని అన్ని దేశాల్లో వినియోగించే మొత్తం విద్యుత్తు కంటే అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. రానున్న 3 దశాబ్దాల్లో భారత ఇంధన డిమాండ్ ప్రపంచంలోని ఏ ప్రాంతంలో లేదా ఏ దేశంలో లేనంత భారీగా పెరుగుతుందని తాజా నివేదికలో పేర్కొన్నది.
2022- 42 ఎక్సాజౌల్స్
2030- 53.7 ఎక్సాజౌల్స్
2050- 73 ఎక్సాజౌల్స్
2010లో – ప్రతి 100 కుటుంబాలకు 24
3 రెట్లు- గత 12 ఏండ్లలో పెరిగిన ఏసీల సంఖ్య