అహ్మదాబాద్: ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ కార్యకర్తలు ఒక కాలేజ్ ప్రిన్సిపాల్తో ‘జై శ్రీరాం’ అని అనిపించడంతోపాటు విద్యార్థులను మందలించినందుకు ఆయనతో క్షమాపణలు కూడా చెప్పించారు. బీజేపీ పాలిత గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. అహ్మదాబాద్లోని హెచ్ఏ కాలేజీకి చెందిన ఏబీవీపీ విద్యార్థులు క్లాస్లో గట్టిగా నినాదాలు చేసి టీచింగ్కు అంతరాయం కలిగించారు. దీంతో ఆగ్రహించిన లెక్చరర్ ఆ విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్ వకీల్ రూమ్కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను ఆయన మందలించారు. ఆ లెక్చరర్కు విద్యార్థులు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో వారిని వెళ్లమని చెప్పారు.
కాగా, కొంత మంది ఏవీబీపీ కార్యకర్తలు, ఆ విద్యార్థులు కలిసి శనివారం కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ వకీల్ చాంబర్కు వెళ్లారు. మత మనోభావాలను ఆయన దెబ్బతీశారని ఆరోపించారు. ఆ ప్రిన్సిపాల్తో బలవంతంగా ‘జై శ్రీరాం’ అని అనిపించారు. అలాగే మందలించిన విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పించారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.