కోల్కతా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో పాదయాత్రకు సిద్ధమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మేనల్లుడు అభిషేక్ బెనర్జిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈశాన్య రాష్ట్రాలు అన్నింటా తమ పార్టీని విస్తరించాలనే ఆశతో టీఎంసీ అడుగులు వేస్తున్నదని, అందులో భాగంగానే అభిషేక్ బెనర్జి త్రిపురలో పాదయాత్ర నిర్వహరణకు ప్లాన్ చేసుకున్నాడని పశ్చిమబెంగాల్ బీజేపీ నూతన అధ్యక్షుడు సుకాంత మజుందార్ వ్యాఖ్యానించారు.
కానీ, త్రిపురలో పాదయాత్రకు బదులుగా అభిషేక్ బెనర్జి దేశ సంచారం చేస్తే బాగుంటుందని సుకాంత దాస్ సలహా ఇచ్చారు. ఒకసారి ఆయన దేశయాత్ర చేసివస్తే ప్రతిపక్షాలతో ఎలా ప్రవర్తించాలో తెలిసొచ్చేదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ పట్టు అంతకంతకే పెరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చట్టసభలో తమ ప్రాతినిధ్యం 3 నుంచి 77 పెరిగిందన్నారు. బెంగాల్లో తమ భారీ విజయానికి ఈ గణాంకాలు నిదర్శనమని చెప్పారు.