న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు. ఇవాళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆప్కు జాతీయ పార్టీ హోదాపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైవిధంగా సమాధానం చెప్పారు.
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ (Delhi), పంజాబ్ (Punjab) రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అదేవిధంగా గోవా (Goa), గుజరాత్ (Gujarat) రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం నియామావళి ప్రకారం కావాల్సినంత శాతం ఓట్లను దక్కించుకుని రాష్ట్ర పార్టీ హోదా (State Party Status) పొందింది. కాబట్టి నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా పొందిన పార్టీగా ఆప్కు జాతీయ పార్టీ హోదా కల్పించాల్సి ఉన్నది.