న్యూఢిల్లీ : బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’పై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ నేతలు బైఠాయించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.
బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ పై విచారణకు ఆప్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, అతిషి తదితర నేతలు బుధవారం సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి దీనిపై విచారణ జరిపించాలని కోరింది. సీబీఐ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన పలువురు ఆప్ నేతలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దాంతో వారు కార్యాలయం వెలుపల ధర్నాకు కూర్చున్నారు. ‘ఆపరేషన్ లోటస్’ పేరుతో బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆప్ ఆరోపించింది.
‘ఆపరేషన్ లోటస్’పై బీజేపీ రూ.6,300 కోట్లపైగా ఖర్చు చేసిందని ఆప్ నేతలు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరపాలని పార్టీ డిమాండ్ చేస్తున్నదని ఆప్ నేత అతిషి ట్వీట్ చేశారు. ‘ఆపరేషన్ లోటస్’పై ఫిర్యాదు చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేల బృందం సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్తగా పోలీసులు అడ్డుకుని బయటకు పంపించారని ఆప్ ఆరోపించింది. దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ కమలం’పై బీజేపీ వెచ్చించిన రూ.6,300 కోట్ల మూలాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు.