మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అదుపులోకి
న్యూఢిల్లీ, మే 30: ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిపారు. జైన్ అరెస్టును ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఖండించారు.
త్వరలో జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ ఇంచార్జ్గా జైన్ ఉన్నారని, ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామన్న భయంతోనే 8 ఏండ్ల నాటి ఓ అబద్ధపు కేసును బీజేపీ ఇప్పుడు తిరగదోడిందని ఆరోపించారు. జైన్ ఏ తప్పూ చేయలేదని, త్వరలోనే ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, జైన్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ. 4.81 కోట్ల ఆస్తులను గత నెల ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే.