Delhi Liquor Case | న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసు దర్యాప్తులో శనివారం కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కైలాశ్ గె హ్లాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు హాజరయ్యారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఈ విధానాన్ని రూపొందించిన మంత్రుల బృందంలో ఆయన కూడా సభ్యుడు కావడంతో ఈడీ ఆ యనను విచారణకు పిలిచింది. గెహ్లాట్ రవా ణా, హోం, న్యాయ శాఖలను నిర్వహిస్తున్నా రు.
మంత్రుల బృందంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సత్యేందర్ జైన్ కూడా స భ్యులుగా ఉన్నారు. ఈ విధానాన్ని సౌత్ గ్రూ ప్ లిక్కర్ లాబీకి లీక్ చేశారని, అందుకు ప్రతిఫలంగా ఈ లాబీ రూ.100 కోట్ల లంచాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆ పార్టీ నేతలకు ఇచ్చింద ని, ఈ డబ్బులను గోవా ఎన్నికల ప్రచారం కో సం వినియోగించారని ఈడీ ఆరోపిస్తున్న సం గతి తెలిసిందే. గెహ్లాట్ సింగిల్ సిమ్ను వాడారని, అయితే ఐఎంఈఐ మూడుసార్లు మారిందని ఈడీ ఆరోపించింది.
ఈ కేసులో గతంలో అరెస్టయిన విజయ్ నాయర్ కొంత కాలంపా టు నజఫ్గఢ్లోని ప్రభుత్వ బంగళాలో బస చేశారని, ఈ బంగళా గెహ్లాట్కు కేటాయించినదని, ఇది నేరపూరిత నమ్మక ద్రోహమని ఈడీ వాదిస్తున్నది. కాగా, ఈడీ విచారణ అనంత రం కైలాశ్ గెహ్లాట్ విలేకరులతో మాట్లాడు తూ… ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ప్రచారంలో భాగం కాలేదని, ఏం జరిగిందనేది తనకు తెలియదని పేర్కొన్నారు. తనకు ప్రభుత్వ బంగళా కేటాయించినప్పటికీ, తన భార్యాపిల్లలకు ఇష్టం లేకపోవడం వల్ల సొంతింట్లోనే నివసిస్తున్నానని చెప్పారు.
సాక్షుల్లో ఒకరికి బీజేపీతో సంబంధాలు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులోని సాక్షుల్లో ఒకరై న మాగుంట రాఘవ రెడ్డి తండ్రి శ్రీనివాసు లు రెడ్డిని టీడీపీ లోక్సభ ఎన్నికల బరిలో దిం చిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. టీడీపీ, బీ జేపీ మిత్రపక్షాలని; ఈడీ స్వతంత్ర సంస్థ అ యి ఉంటే, రాఘవ రెడ్డి, బీజేపీ మధ్య సంబంధాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. సౌత్ లాబీతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ రాష్ట్ర మంత్రి ఆతిశీ ఆరోపించారు.
జలమండలి కేసులో ఛార్జిషీట్!
ఢిల్లీ జల మండలిలో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించిన ఈడీ ఈ కేసులో ఈ నెల 28న ఛార్జిషీటును దాఖ లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డీజేబీ మాజీ చీఫ్ ఇంజినీరు జగదీశ్ కుమార్ అరో రా, కాంట్రాక్టర్ అనిల్ కుమార్ అగర్వాల్, మాజీ ఎన్బీసీసీ జనరల్ మేనేజర్ డీకే మిట్టల్, తేజిందర్ సింగ్, ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లను నిందితులుగా చేర్చినట్లు సమాచారం.
జార్ఘండ్ ల్యాండ్ స్కామ్లో ఛార్జిషీట్
రాంచీ: భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు శనివారం ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు లో ఛార్జిషీట్ను దాఖలు చేశారు. రాంచీలోని బర్దగాయ్లో ఉన్న భూములకు సంబంధించిన ఈ కేసులో మాజీ సీఎం హేమంత్ జ్యుడిషియల్ కస్టడీ గడువు ఏప్రిల్ 4 వరకు ఉంది.
సునీతకు కల్పన సొరేన్ సంఘీభావం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్ శనివారం సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో వీరి భే టీ జరిగింది.శక్తిమంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉం టుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీశి ట్వీట్ చేశా రు. కల్పన విలేకర్లతో మాట్లాడుతూ, సునీత కేజ్రీవాల్కు యావత్తు జార్ఖం డ్ ప్రజలు అండగా ఉంటారని, తాము ఒకరి ఆవేదనను మరొకరం పంచుకున్నామని చెప్పారు.తాము కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామన్నారు.