న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మేయర్ అభ్యర్థి శైలి ఒబెరాయ్ సుప్రీంను ఆశ్రయించారు. మేయర్ను గడువులోగా ఎన్నుకునేలా చూడాలంటూ శైలి ఒబెరాయ్ పిటిషన్ దాఖలు చేశారు. శైలి పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారించే అవకాశం ఉంది. డిసెంబర్లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరుగడంతో పాటు ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్ ఎన్నిక జరుగడం లేదు. మేయర్ ఎన్నికల తేదీని జనవరి 9, 24వ తేదీల్లో రెండుసార్లు నిర్వహించగా.. గందరగోళం కారణంగా ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో శైలి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి.