AAP | ద్రోహం చేస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి ఐదు రాష్ట్రాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ద్రోహం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పి, ఆమ్ఆద్మీ పార్టీకి ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా స్పందించారు. వర్చువల్ ప్రచారానికి, ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ఓ వ్యూహాన్ని కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని, ఇది గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా చండీగఢ్లో కూడా రుజువైందని సిసోడియా అన్నారు.
మరోవైపు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ దెబ్బతిన్నది. ఎన్నికల్లో 14 స్థానాలను గెలుచుకొని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 12 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. మేయర్ పీఠం ఆప్దేనని అందరూ అనుకున్నారు. కానీ మేయర్ ఎన్నిక సమయంలో ఆప్ ఘోరంగా దెబ్బతిన్నది. బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 28 ఓట్లుండగా, 14 ఓట్లు బీజేపీ మేయర్ అభ్యర్థి సరబ్జీత్ కౌర్కు పడ్డాయి. దీంతో సరబ్జీత్ కౌర్ చండీగఢ్ మేయర్గా ఎన్నికయ్యారు.