చంఢీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించింది. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో ఆ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ టార్గెట్ మార్క్ దాటింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్లో ఆప్ సర్కార్ ఖాయమైంది. ఆ రాష్ట్రంలో హేమాహేమీలు దారుణంగా విఫలమైనట్లు తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. లంబీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు. శిరోమనీ అకాలీదళ్ నేత గనివీ కౌర్ మంజిత లీడింగ్లో ఉన్నారు. తాజా రిపోర్ట్ ప్రకారం 78 స్థానాల్లో ఆమ్ ఆద్మీ లీడింగ్లో ఉంది. పాటియాలా అర్బన్ నుంచి పోటీ చేసిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెనుకంజలో ఉన్నారు.