న్యూఢిల్లీ : సినిమా షూటింగ్లకు 15 రోజుల్లో సింగిల్ విండో ఆన్లైన్ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలతో ఆప్ ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ ఫిల్మ్ పాలసీని శుక్రవారం ప్రకటించనుంది. సినిమా షూటింగ్లకు సంబంధించి 25 శాఖలతో కూడిన ఆన్లైన్ ఈ క్లియరెన్స్ను ఇచ్చేలా ఈ విధానానికి రూపకల్పన జరిగిందని అధికారులు తెలిపారు.
ఫిల్మ్ పాలసీ అమలుకు ఢిల్లీ టూరిజం ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సినిమాల ప్రోత్సాహం, టూరిజం పాలసీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట ఉపాధి అవకాశాల కల్పన, ఆర్ధిక వ్యవస్ధ ఉత్తేజం కోసం ప్రగతిశీల ఫిల్మ్ పాలసీని ముందుకు తెచ్చామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు.
ప్రతిఏటా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు, నిర్మాతలకు ప్రోత్సహించేందుకు రూ 50 కోట్లతో ఢిల్లీ ఫిల్మ్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఢిల్లీని సినీ పరిశ్రమకు హబ్గా మార్చేందుకు ఫిల్మ్ పాలసీ రూపొందించామని తెలిపారు.