అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గద్వి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఖంభాలియా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దేవభూమి ద్వారక జిల్లాలో ఆ నియోజకవర్గం ఉన్నది. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారవేత్తల తరపున ఇసుదాన్ పోరాటం చేశారన్నారు. కృష్ణుడికి చెందిన పవిత్ర స్థలం నుంచి గుజరాత్కు కొత్త ముఖ్యమంత్రి రానున్నట్లు కేజ్రీ తెలిపారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.