మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్కు ప్రమోషన్ లభించనుంది. ఆయన్ను ఆమ్ఆద్మీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. దీంతో పాటు స్పోర్ట్స్ యూనివర్శిటీలో కీలక బాధ్యతలను కూడా అప్పజెప్పనున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆప్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లెక్కల ప్రకారం రాజ్యసభలో ఆప్కు ఐదు సీట్లు దక్కుతాయి. మొట్ట మొదటగా హర్భజన్ పేరునే కేజ్రీవాల్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే కేజ్రీవాల్ హర్భజన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నామని ప్రకటించనున్నారు.
గతంలో హర్భజన్ కాంగ్రెస్లో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సిద్దూతో భజ్జీ భేటీ అయ్యారు. అతి త్వరలో భజ్జీ కాంగ్రెస్లో చేరుతున్నారని, ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారని పంజాబ్ కాంగ్రెస్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.