హైదరాబాద్, మార్చి 26: మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో పాటు ఐదు ముఖ్యమైన పనులకు సైతం గడువు తీరుతుంది. వీటిని పూర్తి చేసుకోవడానికి ఇంకా ఐదు రోజులే గడువు ఉంది కాబట్టి త్వరపడాల్సిన అవసరం ఉంది.
ఆధార్ – పాన్ లింక్
ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి, ఆర్థిక లావాదేవీలు జరపడానికి ఆధార్, పాన్ కార్డు ముఖ్యమైనవి. ఇవి రెండూ లింక్ చేసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చివరి అవకాశంగా ఈ మార్చి 31లోగా లింక్ చేసుకోవాలని, ఒకవేళ లింక్ చేసుకోకపోతే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు పని చేయదని పేర్కొంది.
మ్యూచువల్ ఫండ్ నామినీ నమోదు
మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతూ ఇప్పటివరకు నామినీని నమోదు చేసుకోకపోతే మార్చి 31లోగా కచ్చితంగా చేసుకోవాలి. ఈ మేరకు సెబీ చివరి గడువు ఇచ్చింది. ఒకవేళ నామినీని నమోదు చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఇదే విషయాన్ని డిక్లరేషన్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి ఖాతాలు స్తంభించిపోతాయి.
ప్రధానమంత్రి వయ వందన యోజన
సీనియర్ సిటిజన్ల కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి వయ వందన యోజన(పీఎంవీవీవై)లో పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ మార్చి 31తో ముగుస్తుంది. పీఎంవీవీవై అనేది పింఛను, ఇన్సూరెన్స్ పథకం. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏడాదికి 7.40 శాతం వడ్డీ అందుతుంది.
ఆదాయ పన్ను మినహాయింపు
ఎల్ఐసీ అధిక ప్రీమియం పాలసీ
ఎల్ఐసీలో అధిక ప్రీమియం పాలసీ తీసుకొని ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందేందుకు మార్చి 31 చివరి తేదీ. ఒకవేళ అధిక ప్రీమియం పాలసీ తీసుకోవాలనుకునేవారు ఈ ఐదు రోజుల్లో తీసుకుంటే పన్ను మినహాయింపు పొందవచ్చు.